చంద్రబాబును తిట్టే స్థాయి వారికి లేదు: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2020-12-02T16:11:51+05:30 IST

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..

చంద్రబాబును తిట్టే స్థాయి వారికి లేదు: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌: అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసీపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని అనరాని భాషతో దూషించడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. హుందాగా వ్యవహరించవలసిన ముఖ్యమంత్రి అసెంబ్లీలో చంద్రబాబును అపహాస్యం చేస్తూ వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మంత్రుల మాటలను మహిళలు సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారన్నారు. లబ్ధిదారులకు జి ప్లస్‌ 3 ఇళ్లు ఇచ్చేందుకు వైసీపీ నాయకులకు మనసు ఒప్పడం లేదన్నారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, అక్కు మహంతి రాజా, అజీమ్‌, గోకుల శివ, సంకుల నాని పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T16:11:51+05:30 IST