‘శానిటైజర్‌’ తాగించడం మద్య నిషేధమా?: లోకేశ్‌

ABN , First Publish Date - 2020-08-09T09:46:35+05:30 IST

‘‘ప్రభుత్వ దుకాణాలు తెరిచి, సొంత బ్రాండ్లు తెచ్చి, రేట్లు పెంచి.. మద్య నిషేధం అంటూ సీఎం జగన్‌

‘శానిటైజర్‌’ తాగించడం మద్య నిషేధమా?: లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ దుకాణాలు తెరిచి, సొంత బ్రాండ్లు తెచ్చి, రేట్లు పెంచి.. మద్య నిషేధం అంటూ సీఎం జగన్‌ కొత్త నిర్వచనం చెప్పారు. ఇప్పుడు శానిటైజర్‌ తాగించి ప్రజల్ని పొట్టన పెట్టుకోవడం కూడా మద్య నిషేధంలో భాగమేనంటారేమో’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. నాటుసారా, శానిటైజర్లు తాగి రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది చనిపోయినా ఈ దున్నపోతు ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శించారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని, వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని శనివారం ఓ ప్రకటనలో లోకేశ్‌ కోరారు.    

Updated Date - 2020-08-09T09:46:35+05:30 IST