ఆర్కేపై అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి: Sujatha

ABN , First Publish Date - 2021-12-13T17:27:02+05:30 IST

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు.

ఆర్కేపై అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి: Sujatha

ఏలూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలన్నారు. ఆంధ్రజ్యోతిపై వైసీపీ ప్రభుత్వం దాడి పత్రికా స్వేచ్ఛపై చేస్తున్న దాడి అని అన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా లోపాలను సవరించుకుని ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయాలని హితవుపలికారు. ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి మానుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెపుతారని పీతల సుజాత హెచ్చరించారు. 

Updated Date - 2021-12-13T17:27:02+05:30 IST