మంత్రి పదవి పోయినందుకు బాధగా లేదు...కానీ: Sucharitha
ABN , First Publish Date - 2022-04-11T18:32:06+05:30 IST
రెండేన్నరేళ్ల మాత్రమే మంత్రి పదవి అని జగన్ అన్న ముందే చెప్పారని మాజీ మంత్రి సుచరిత అన్నారు.
గుంటూరు: రెండేన్నరేళ్ల మాత్రమే మంత్రి పదవి అని జగన్ అన్న ముందే చెప్పారని మాజీ మంత్రి సుచరిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదని... కానీ కొన్ని కారణాలు బాధంచాయన్నారు. ‘‘నా వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని తెలిపారు. రాజకీయాలలో ఉన్నంత కాలంలో జగన్ వెంటే ఉంటానన్నారు. ‘‘నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. పార్టీ నేతలంతా సంయమనం పాటించాలి. నేను పదవిలో ఉన్న లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా’’ అని సుచరిత స్పష్టం చేశారు. సుచరిత వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఆందోళన విరమించారు.