Gunturలో జీవీ ఆంజనేయులు వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-10-10T17:42:20+05:30 IST

విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినూత్న నిరసన చేపట్టారు.

Gunturలో జీవీ ఆంజనేయులు వినూత్న నిరసన

గుంటూరు: విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ  వినుకొండ మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినూత్న నిరసన చేపట్టారు. శావల్యాపురం మండలం శానంపూడి ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్న జీవీ... విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఒక లైట్, ఒక ఫ్యాన్ ఉన్న గుడెసెకు రూ.49 వేలు బిల్లు వచ్చిందని  బాధితురాలు వాపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ జగన్ పేరుతో బ్యాంక్ ఏర్పాటు చేయాలని... కరెంట్ బిల్లులు చెల్లింపు కోసం జగన్ రెడ్డి బ్యాంకులో లోన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు నినాదాలు చేశారు. జగన్ రెడ్డికి ఓటు వేసి పవర్ ఇస్తే పేదలకు ఇళ్లకు పవర్ లేకుండా చేశారని మండిపడ్డారు. ఫ్యాన్‌కు ఓట్లు వేసిన వారికి ఫ్యాన్ వేసుకునే పరిస్థితి లేదని తెలిపారు. ట్రూ అప్ చార్జీలతో జగనన్న బాధుడు పధకం పెట్టారని మండిపడ్డారు. జగన్ రెడ్డి బాధుడుతో జనాల వీపులు వాచిపోతున్నాయన్నారు. పెంచిన విద్యుత్ బిల్లులు తగ్గించకపోతే జగన్ పవర్ కట్ అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. నెలఖారులోపు పెంచిన చార్జ్‌లు  రద్దు చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానని జీవీ ఆంజనేయులు తెలిపారు. 

Updated Date - 2021-10-10T17:42:20+05:30 IST