పూజచేస్తూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత... సీసీటీవీలో దృశ్యాలు రికార్డు
ABN , First Publish Date - 2020-11-16T11:58:21+05:30 IST
ఎవరి జీవితం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. ఇటువంటి విచిత్ర ఘటన...
బైతూల్: ఎవరి జీవితం ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. ఇటువంటి విచిత్ర ఘటన మధ్యప్రదేశ్లోని బైతూల్లో చోటుచేసుకుంది. బైతూల్ మాజీ ఎమెల్యే వినోదా డాగా ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లారు. పూజ చేస్తుండగానే అతను ప్రాణాలు కోల్పోయారు. వినోద్ డాగా చనిపోయిన ఉదంతం అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యింది.
వివరాల్లోకి వెళితే థన్తేరస్ సందర్భంగా బైతూల్ మాజీ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కోశాధికారి వినోదా డాగా... దాదావాడీలోని ఆలయంలో పూజ చేసేందుకు వెళ్లారు. ముందుగా ఆయన ఆలయంలోని పార్శ్వనాథునికి పూజలు నిర్వహించారు. తరువాత దాదా గురుదేవ్ మందిరంలో ప్రదక్షిణలు చేసి, పూజ చేశారు. అనంతరం దాదా గురుదేవ్ పాదాలకు మోకరిల్లారు. తరువాత కొంచెం పక్కకు కదిలేలోగానే కొన్ని సెకెన్ల వ్యవధిలోనే ఎమ్మెల్యే వినోద్ డాగా ప్రాణాలొదిరారు. ఆ సమయంలో ఒక బాలుడు మందిరంలోకి వచ్చి, ఎమ్మెల్యే కిందపడి ఉండటాన్ని గమనించి పూజారికి చెప్పాడు.
వెంటనే పూజారితోపాటు అక్కడున్నవారంతా మాజీ ఎమ్మెల్యేను లేపే ప్రయత్నం చేశారు. తరువాత సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి అప్పటికే మృతి చెందారని స్పష్టం చేశారు. దీనికి ముందు మాజీ ఎమ్మెల్యే వినోద్ డాగా మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాల గురించి సమీక్షించేందుకు భోపాల్ నుంచి బైతూల్ వచ్చారు.
‘హెచ్ కాన్సెప్ట్ కూల్ వీడియోస్’ సౌజన్యంతో...