సీఎం కేసీఆర్ దళిత ద్రోహి: వివేక్

ABN , First Publish Date - 2021-01-25T16:21:57+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అని మాజీ ఎంపి వివేక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సీఎం కేసీఆర్ దళిత ద్రోహి: వివేక్

పెద్దపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అని  మాజీ ఎంపి వివేక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. రామగుండం కార్పొరేషన్‌లో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఓట్ల రాజకీయం చేస్తున్నాడని... కొడుకును ముఖ్యమంత్రిని చేసే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వివేక్ హితవు పలికారు. 

Updated Date - 2021-01-25T16:21:57+05:30 IST