ప్రధానమంత్రి సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్

ABN , First Publish Date - 2022-05-02T23:38:43+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కుమార్

ప్రధానమంత్రి సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పర్సనల్ మంత్రిత్వశాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కపూర్ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన గతేడాది నవంబరు 30న పదవీ విరమణ పొందారు.


ఇప్పుడాయనను ప్రధానమంత్రి సలహాదారుగా నియమించేందుకు కేబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. అలాగే, సీనియర్ బ్యూరోక్రాట్లు హరి రంజన్, అతిష్ చంద్ర ప్రధానమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శలుగా నియమితులయ్యారు. 

Read more