అమెరికాలో పీవీ విగ్రహం..
ABN , First Publish Date - 2021-10-06T13:15:59+05:30 IST
అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అమెరికన్ ఇండియన్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకొచ్చారు.
ఎంపీ కేశవరావుతో అమెరికన్ ప్రతినిధి భేటీ
హైదరాబాద్: అమెరికాలోని జార్జియా రాష్ట్రం అట్లాంటాలో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అమెరికన్ ఇండియన్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం పీవీ విగ్రహ కమిటీ చైర్మన్, ఎంపీ కేశవరావుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీవీ కమిటీ సభ్యులు పీవీ ప్రభాకర్, మహేష్ బిగాల, చంద్రశేఖర్, అమెరికా ప్రతినిధి డాక్టర్ పాడీ శర్మ పాల్గొన్నారు. ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను, పీవీ అభిమానులను, ఆయన కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నట్టు పాడీ శర్మ వివరించారు. మిగతా దేశాల్లోనూ పీవీ విగ్రహ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేశవరావు వెల్లడించారు.