రాజస్థాన్ మాజీ గవర్నర్ కన్నుమూత
ABN , First Publish Date - 2021-03-08T21:25:19+05:30 IST
కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్న రాజస్థాన్ మాజీ గవర్నర్ అన్షుమాన్ సింగ్..
లక్నో: కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్న రాజస్థాన్ మాజీ గవర్నర్ అన్షుమాన్ సింగ్ సోమవారంనాడు కన్నుమూశారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. ప్రయాగ్రాజ్లో అన్షుమాన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, అన్షుమాన్ సింగ్ మృతికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతాపం తెలిపారు.
జస్టిస్ (రిటైర్డ్) అన్షుమాన్ సింగ్ 1999 జనవరి 16న రాజస్థాన్ గవర్నర్గా పదవీ బాధ్యతలు చేపట్టి 2003 మే వరకూ కొనసాగారు. 1935లో అలహాబాద్ (ప్రస్తుతం ప్రయోగ్రాజ్)లో ఆర్ట్స్ అండ్ లా విద్య చదివారు. 1957లో అలహాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పని చేశారు. 1984లో అలహాబాద్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత రాజస్థాన్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా పనిచేశారు.