Gone prakash rao: ఎమ్మెల్యేల అక్రమాలను సేకరిస్తున్నా.. ఆధారాలు సీఎంకు పంపిస్తా

ABN , First Publish Date - 2022-10-02T18:03:58+05:30 IST

నక్సల్స్ బలం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gone prakash rao: ఎమ్మెల్యేల అక్రమాలను సేకరిస్తున్నా.. ఆధారాలు సీఎంకు పంపిస్తా

కరీంనగర్: నక్సల్స్ బలం ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)కు బాగా తెలుసని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు (Gone prakash rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్(Telangana CM) మంత్రిగా ఉన్నప్పుడు నక్సల్స్ లేఖలు రాశారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి(Rajashekar reddy) హయాంలో నక్సల్స్ బలహీన పడ్డారని అన్నారు. కోల్ బెల్ట్ ప్రాంతమైన రామగుండం, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలకు మావో హెచ్చరికలు వచ్చాయని గుర్తుచేశారు. మెడికల్, ఉద్యోగాల మాఫియాపై మావోయిస్టులు సీరియస్‌గా ఉన్నారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి బావ రూ.8 కోట్ల ప్రాపర్టీ ని ఆక్రమించారని ఆరోపించారు. ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపాలని అనిపిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యేల అక్రమాలను సేకరిస్తున్నా.. ఆధారాలు సీఎంకు పంపిస్తానని గొనె ప్రకాష్ రావు (Former RTC Chairman) వెల్లడించారు.

Updated Date - 2022-10-02T18:03:58+05:30 IST