మాజీ సర్పంచ్‌.. మాస్టారయ్యారు..!

ABN , First Publish Date - 2022-06-26T05:24:22+05:30 IST

కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన నాటి సర్పంచ్‌ పింజరి జంగిల్‌ సాహెబ్‌ నేడు మాస్టార్‌ అయ్యారు.

మాజీ సర్పంచ్‌.. మాస్టారయ్యారు..!

కొత్తపల్లి, జూన్‌ 25: కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన నాటి సర్పంచ్‌ పింజరి జంగిల్‌ సాహెబ్‌ నేడు మాస్టార్‌ అయ్యారు. 1998లో నిర్వహించిన డీఎస్సీలో ఓపెన్‌ క్యాటగిరీలో ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన 52 ఏళ్ల జంగిల్‌ సాహెబ్‌ 1996 డీఎస్సీ, 2000ల సవంత్సరం డీఎస్సీ రాసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అప్పటి నుంచి గ్రామంలో తన 7 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. 1999లో కొత్తపల్లిలో సరస్వతి పాఠశాల ప్రారంభించి నష్టం రావడంతో పాఠశాలను ఇతరులకు విక్రయించారు. 2001లో వీరాపురం గ్రామ పంచాయతీ బీసీకి రిజర్వ్‌ కావడంతో జంగిల్‌ సాహెబ్‌ సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఎట్టకేలకు 52 ఏళ్ల వయసులో 98 డీఎస్సీ జాబితాలో జంగిల్‌ సాబ్‌ పేరు ఉండటంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, మిత్రులకు మిఠాయిలు పంచి పెట్టారు.

Updated Date - 2022-06-26T05:24:22+05:30 IST