బౌలింగ్‌ చేయకపోతే స్థానం వృథా

ABN , First Publish Date - 2021-05-15T09:19:23+05:30 IST

రెండేళ్ల క్రితం వెన్నెముకకు సర్జరీ తర్వాత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రెగ్యులర్‌గా బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు.

బౌలింగ్‌ చేయకపోతే స్థానం వృథా

 హార్దిక్‌పై మాజీ సెలెక్టర్‌శరణ్‌దీప్‌


న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం వెన్నెముకకు సర్జరీ తర్వాత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా రెగ్యులర్‌గా బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. ఇటీవలి ఐపీఎల్‌లోనూ అడపాదడపా బౌలింగ్‌ చేశాడు. దీంతో ఆల్‌రౌండర్‌ కోటాలో అతడికి టెస్టు జట్టులోనూ స్థానం దక్కలేదు. అయితే పాండ్యాపై సరైన నిర్ణయమే తీసుకున్నారని మాజీ సెలెక్టర్‌ శరణ్‌ దీప్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ‘ఇంగ్లండ్‌ టూర్‌కు పాండ్యాను పక్కనబెట్టడం అర్థం చేసుకోదగిందే. సర్జరీ తర్వాత తను బౌలింగ్‌కు దూరమవుతున్నాడు. ఇక వన్డేల్లోనూ 10 ఓవర్లు.. టీ20లో నాలుగు ఓవర్లపాటు తను బౌలింగ్‌ చేస్తేనే తుది జట్టులో ఉంచాలి. కేవలం బ్యాట్స్‌మన్‌గా ఉంటే సరిపోదు. ఎందుకంటే జట్టు కూర్పు దెబ్బతింటుంది. అదనపు బౌలర్‌గా మరొకరిని తీసుకుంటే సూర్యకుమార్‌లాంటి వారిని తప్పించాల్సి వస్తుంది’ అని శరణ్‌దీప్‌ సింగ్‌ తెలిపాడు.

Updated Date - 2021-05-15T09:19:23+05:30 IST