తాడికొండ మాజీ ఎమ్మెల్యే వెంకయ్య మృతి
ABN , First Publish Date - 2021-08-20T08:09:00+05:30 IST
కాంగ్రె్సపార్టీ సీనియర్ నాయకులు, తాడికొండ మాజీఎమ్మెల్యే డాక్టర్ తిరువాయిపాటి వెంకయ్య (92) కన్నుమూశారు.
పొన్నూరుటౌన్, ఆగస్టు 19: కాంగ్రె్సపార్టీ సీనియర్ నాయకులు, తాడికొండ మాజీఎమ్మెల్యే డాక్టర్ తిరువాయిపాటి వెంకయ్య (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పొన్నూరు పట్టణానికి చెందిన డాక్టర్ వెంకయ్య 1989లో తాడికొండ శాసనసభ్యునిగా ఎన్నికై 1994 వరకు సేవలందించారు.