బీజేపీలో చేరిన తృణమూల్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేదీ

ABN , First Publish Date - 2021-03-06T18:34:55+05:30 IST

తృణమూల్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఎంపీ దినేశ్ త్రివేదీ శనివారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో

బీజేపీలో చేరిన తృణమూల్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేదీ

న్యూఢిల్లీ : తృణమూల్ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఎంపీ దినేశ్ త్రివేదీ శనివారం బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ... ‘‘దినేశ్ త్రివేదీని బీజేపీలోకి సాదరంగా స్వాగతిస్తున్నాం. సరైన వ్యక్తి తప్పుడు పార్టీలో ఉన్నారని పదే పదే నేను చెబుతుండేవాణ్ని. ఇప్పుడు సరైన వ్యక్తి, సరైన పార్టీలోకి వచ్చారు. బెంగాల్ ఎన్నికల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.’’ అని నడ్డా పేర్కొన్నారు. ఇక బీజేపీలో చేరిన తర్వాత దినేశ్ త్రివేదీ మాట్లాడుతూ... ‘‘కొన్ని పార్టీలు ప్రజలకు సేవ చేయవు. వారి వారి కుటుంబాలకు సేవ చేసుకుంటాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చాలా మంది నన్ను అడుగుతుంటారు. ప్రస్తుత ప్రభుత్వ సారథ్యంలో భారీగా అవినీతి జరుగుతోంది అని చెప్పా.’’ అని దినేశ్ త్రివేదీ పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా పనిచేస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకపోయినా తాను మాత్రం క్రియాశీలకంగా ఉంటానని పేర్కొన్నారు. తృణమూల్‌ను బెంగాల్ ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని, అవినీతిని, హింసను కాదని స్పష్టం చేశారు. నిజమైన మార్పుకు బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

Updated Date - 2021-03-06T18:34:55+05:30 IST