రైతుల దీక్షకు మద్దతుగా కొవ్వొత్తుల ర్యాలీ
ABN , First Publish Date - 2021-03-07T04:26:01+05:30 IST
ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం 100 రోజులు పూర్తైన సందర్భంగా మండలంలోని దామరమడుగులో సీపీఎం అధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీతో మద్దతు పలికారు.
బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 6: ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం 100 రోజులు పూర్తైన సందర్భంగా మండలంలోని దామరమడుగులో సీపీఎం అధ్వర్యంలో శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీతో మద్దతు పలికారు. రైతుల హక్కుల సాధన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపం తెలియజేశారు. హైవే కూడలి వద్ద సమావేశం నిర్వహించి రైతుల పోరాటాన్ని కొనియాడారు. జొన్నలగడ్డ వెంకమరాజు, గండవరపు శ్రీనివాసులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.