భూమికి పచ్చని రంగేసినట్టు!

ABN , First Publish Date - 2020-07-07T07:06:08+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో ఎటుచూసినా భూమికి పచ్చని రంగేసినట్లు కనిపిస్తోంది. పట్టణాలు కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే, గ్రామాల్లో రైతులు మాత్రం వ్యవసాయ పనుల్లో ఊపిరి సలపకుండా

భూమికి పచ్చని రంగేసినట్టు!

నిజామాబాద్‌ జిల్లాలో వరి నాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో ఎటుచూసినా భూమికి పచ్చని రంగేసినట్లు కనిపిస్తోంది. పట్టణాలు కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే, గ్రామాల్లో రైతులు మాత్రం వ్యవసాయ పనుల్లో ఊపిరి సలపకుండా ఉన్నారు. 20 రోజులుగా కురుస్తున్న వర్షాలు పొలం పనులకు ఊతం ఇచ్చాయి. ఎడపల్లి మండలం జానకంపేట్‌ శివారులోని పొలాలన్నీ వరినాట్లతో నిండిపోయాయి. భూమికి ఆకుపచ్చని రంగేసినట్లు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

- ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, నిజామాబాద్‌ 

Updated Date - 2020-07-07T07:06:08+05:30 IST