నాలుగు రోజులు.. 98 కిలోల చందనం
ABN , First Publish Date - 2021-05-11T04:36:04+05:30 IST
చందనోత్సవం సందర్భంగా ఈనెల 14న సింహాద్రి అప్పన్న స్వామికి పై పూతగా పూసేందుకు నాలుగో రోజైన సోమవారం సుమారు 28 కిలోల చందనాన్ని సిబ్బంది అరగదీశారు.
సింహాచలం, మే 10: చందనోత్సవం సందర్భంగా ఈనెల 14న సింహాద్రి అప్పన్న స్వామికి పై పూతగా పూసేందుకు నాలుగో రోజైన సోమవారం సుమారు 28 కిలోల చందనాన్ని సిబ్బంది అరగదీశారు. నాలుగు రోజుల కు కలిపి 98 కిలోల చంద నాన్ని ఆలయ అధికారులు బాంఢాగారంలో భద్రప రిచారు. కాగా ఈనెల 14న చందనోత్సవం సందర్భంగా సహస్ర ఘటాభిషేకానికి వినియోగించేందుకు గాను 1,008 మట్టి కలశాలను సోమవారం ఆలయ బేడా మండపానికి తెచ్చారు. వీటి నాణ్యతను పురోహితుడు కరి సీతారామాచార్యులు పర్యవేక్షణలో పరిశీలించి భద్రపరచారు.