షాకింగ్ : కాన్పూరులో నాలుగు మానవ అస్థి పంజరాలు లభ్యం

ABN , First Publish Date - 2020-12-08T12:18:23+05:30 IST

కాన్పూరు నగరంలోని ఓ కాలనీలో నాలుగు మానవ అస్థి పంజరాలు లభించిన దిగ్ర్భాంతికరమైన సంఘటన...

షాకింగ్ : కాన్పూరులో నాలుగు మానవ అస్థి పంజరాలు లభ్యం

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): కాన్పూరు నగరంలోని ఓ కాలనీలో నాలుగు మానవ అస్థి పంజరాలు లభించిన దిగ్ర్భాంతికరమైన సంఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలోని పంకీ కాలనీలో నాలుగు మానవ అస్థిపంజరాలను పోలీసులు కనుగొన్నారు.కాలనీలో నాలుగు అస్థిపంజరాలు లభించడంతో ప్రజలు కలవరపడ్డారు. పంకీ కాలనీలో నాలుగు అస్థి పంజరాలు లభించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాన్పూర్ జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ చెప్పారు. నలుగురిని ఎవరైనా హతమార్చారా? లేదా వారే ఆత్మహత్య చేసుకున్నారా అనేది దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.అస్థిపంజరాలు చాలా పాతవని,  ఇవి పెద్ద వ్యక్తులవని పోలీసులు చెప్పారు. అస్థిపంజరాలను పరీక్ష కోసం తరలించి దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. 

Updated Date - 2020-12-08T12:18:23+05:30 IST