Building collapses: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..ముగ్గురి మృతి
ABN , First Publish Date - 2022-09-09T15:54:38+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో(Delhi) నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది...
శిథిలాల్లో చిక్కుకున్న కూలీలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో(Delhi) నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది(building collapses). ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో పలువురు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు చెప్పారు.ఈ ఘటనలో ముగ్గురు మరణించగా,మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.(injured) గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస పనులు చేపట్టారు. శిథిలాల కింద కూలీలు చిక్కుకోవడంతో శిథిలాలను తొలగిస్తున్నారు.