Annamayya జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... నలుగురు మృతి

ABN , First Publish Date - 2022-05-26T14:06:34+05:30 IST

జిల్లాలో మదనపల్లి - పుంగనూరు మార్గమధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Annamayya జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... నలుగురు మృతి

అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లి - పుంగనూరు మార్గమధ్యలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  మృతులు నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-05-26T14:06:34+05:30 IST