కృష్ణా జిల్లాలో.. కరోనాతో నలుగురి మృతి
ABN , First Publish Date - 2021-06-16T14:07:50+05:30 IST
జిల్లాలో కరోనాతో..
కొత్తగా 463 మందికి వైరస్
విజయవాడ: జిల్లాలో కరోనాతో మరో నలుగురు పాజిటివ్ బాధితులు మంగళవారం మరణించారు. గడచిన 24 గంటల్లో 6376మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా వారిలో 463మందికి కరోనా పాజిటివ్గా తేలింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 79, విజయవాడ గ్రామీణ డివిజన్లో 104, నూజివీడు డివిజన్లో 170, మచిలీపట్నం డివిజన్లో 63, గుడివాడ డివిజన్లో 45 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఇతర జిల్లాలకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్గా తేలింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య అధికారికంగా 1041కి పెరిగింది. మొత్తం పాజిటివ్ కేసులు 96316కు చేరుకున్నాయి. వీరిలో ఇప్పటి వరకు 89024మంది వ్యాధి నుంచి కోలుకుని తమ ఇళ్లకు చేరుకోగా.. ఇంకా 6251మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.