కొత్తగా మరో 4 కోవిడ్ ఒమైక్రాన్ కేసులు నమోదు: ఢిల్లీ మంత్రి

ABN , First Publish Date - 2021-12-16T23:42:29+05:30 IST

కొత్తగా మరో 4 కోవిడ్ ఒమైక్రాన్ కేసులు నమోదు: ఢిల్లీ మంత్రి

కొత్తగా మరో 4 కోవిడ్ ఒమైక్రాన్ కేసులు నమోదు: ఢిల్లీ మంత్రి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కోవిడ్-19 కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. గురువారం రోజు ఢిల్లీలో నాలుగు కోవిడ్-19 ఒమైక్రాన్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మొత్తం 10 ఒమైక్రాన్ కేసులను గుర్తించినట్లు మంత్రి చెప్పారు. అనుమానంతో లోక్ నాయక్ ఆస్పత్రిలో 40 మంది చేరినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త కోవిడ్ వేరియంట్ కేసులను గుర్తించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 30 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-16T23:42:29+05:30 IST