నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు : 10 దుంగల స్వాధీనం
ABN , First Publish Date - 2022-05-23T06:54:55+05:30 IST
తిరుమల పాపవినాశనం నుంచి అన్నదమ్ముల బండవైపు వెళ్లే మార్గంలో టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి(కొర్లగుంట), మే 22: తిరుమల పాపవినాశనం నుంచి అన్నదమ్ముల బండవైపు వెళ్లే మార్గంలో టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి 10 దుంగలను స్వాఽధీనం చేసుకున్నారు. ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సురే్షకుమార్రెడ్డి బృందం శనివారం సాయంత్రం పాపవినాశనం అడవుల్లో కూంబింగ్ నిర్వహించింది. ఆదివారం ఉదయాత్పూర్వం కంగుమడుగు అటవీప్రాంతంలో కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకెళుతూ కనిపించారు. వారిని చుట్టుముట్టగా కొందరు పారిపోగా, నలుగురు పట్టుబడ్డారు. విచారణలో.. తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన కుప్పుస్వామి నడిపయ్యన్(45), చంద్రకుమార్ కుప్పుస్వామి(31), కాశి(44), ఏలుమలై గోవిందన్(21)గా గుర్తించారు.