Mumbaiలో కూలిన భవనం...8 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-06-28T13:00:15+05:30 IST

ముంబయి నగరంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది...

Mumbaiలో కూలిన భవనం...8 మందికి గాయాలు

ముంబయి: ముంబయి నగరంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది.ఈ దుర్ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. మరో 20 నుంచి 25 మంది భవన శిథిలాల్లో చిక్కుకుపోయారని అధికారులు అనుమానిస్తున్నారు.ముంబై నగరం కుర్లా ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం సోమవారం రాత్రి కుప్పకూలింది. నాయక్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా ప్రస్తుతం అగ్నిమాపక దళం, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.క్షతగాత్రులను సమీపంలోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. సహాయ అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు. 


మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ‘‘బీఎంసీ నోటీసులు జారీ చేసినప్పుడల్లా భవనాలను ఖాళీ చేయాలి...లేకపోతే, ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, ఇది దురదృష్టకరం.. దీనిపై చర్య తీసుకోవాలి’’ అని ఠాక్రే అన్నారు.నాలుగు భవనాలకు నోటీసులు జారీ చేసినా, ప్రజలు అక్కడ నివసిస్తున్నారని అధికారులు చెప్పారు.


Updated Date - 2022-06-28T13:00:15+05:30 IST