గొడ్డలితో యువకుడి తల నరికి పరారైన మహిళలు.. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు అరెస్ట్!

ABN , First Publish Date - 2022-05-01T07:37:47+05:30 IST

నాలుగేళ్ల క్రితం ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన నలుగురు మహిళలను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగలిగారు. యువకుడి తల నరికి హత్య చేసిన కేసులో ఈ నలుగురు మహిళలు ప్రధాన నిందితులు. గత నాలుగేళ్లుగా వీరు పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు..

గొడ్డలితో యువకుడి తల నరికి పరారైన మహిళలు.. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు అరెస్ట్!

నాలుగేళ్ల క్రితం ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన నలుగురు మహిళలను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగలిగారు. యువకుడి తల నరికి హత్య చేసిన కేసులో ఈ నలుగురు మహిళలు ప్రధాన నిందితులు. గత నాలుగేళ్లుగా వీరు పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించి ఆ మహిళలు పోలీసులకు చిక్కారు.


మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా నౌగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుగాసిలో నివసిస్తున్న జై సింగ్ యాదవ్ అనే వ్యక్తి ఆగస్ట్ 27, 2018న దారుణ హత్యకు గురయ్యాడు. తల లేకుండా మొండెం ఒకటే ఊర్మిల్ నదిలో తేలుతూ కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హతుడిని గుర్తించారు. అనంతరం విచారణ జరిపిన పోలీసులు.. జైసింగ్‌ను నలుగురు పురుషులు, నలుగురు మహిళలు పథకం ప్రకారం హత్య చేసినట్లు నిర్ధారించారు. విశేషమేమిటంటే వీరంతా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు.


ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు మగ నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే మహిళా నిందితులను పట్టుకోవడం వారికి సవాలుగా మారింది. వారి గురించి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు వారిని తాజాగా అరెస్ట్ చేశారు. నిందితులైన విమలా యాదవ్, సంగీత యాదవ్, నీలం యాదవ్, రంజన యాదవ్‌లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.


Updated Date - 2022-05-01T07:37:47+05:30 IST