ఆన్‌లైన్‌ వ్యాపారం.. అధిక లాభం ఆశ చూపి..

ABN , First Publish Date - 2021-05-08T15:03:57+05:30 IST

ఆన్‌లైన్‌ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని..

ఆన్‌లైన్‌ వ్యాపారం.. అధిక లాభం ఆశ చూపి..

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : ఆన్‌లైన్‌ వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని ఆశ చూపించి ఏడు లక్షల రూపాయలు కాజేసిన వారిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందిరానగర్‌కు చెందిన సీహెచ్‌ సురేష్‌కు 2020లో సుధాకర్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తన స్నేహితుడు ఓం ప్రకాశ్‌ శ్రీవాస్తవ్‌ ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ పేరిట ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్నట్టు వివరించాడు. ఇందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తున్నాయని నమ్మించాడు. నమ్మిన సురేష్‌ రూ. 7లక్షలు ప్రకాశ్‌ శ్రీవాస్తవ్‌ ఖాతాలో జమచేశాడు. డబ్బు తీసుకున్నప్పటి నుంచి శ్రీవాస్తవ్‌ స్పందించడం లేదు. డబ్బు తిరిగి ఇవ్వమని సురేష్‌ అడగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. మోసపోయానని గ్రహంచిన సురేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సైబర్‌ సెల్‌కు బదిలీ చేశారు.

Updated Date - 2021-05-08T15:03:57+05:30 IST