ఏటీఎంలో సాయం పేరుతో మోసం
ABN , First Publish Date - 2021-08-08T01:59:29+05:30 IST
జిల్లాలోని కొవ్వూరు పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంలో సాయం పేరుతో మోసం
పశ్చిమ గోదావరి: జిల్లాలోని కొవ్వూరు పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంలో సాయం పేరుతో మోసం జరిగింది. క్యాష్ తీసేందుకు సహాయం చేస్తానని కేటుగాడు కార్డు మార్చేసాడు. రూ.20 వేల చొప్పున రెండు చోట్ల క్యాష్ విత్ డ్రా చేసుకున్నాడు. కొవ్వూరు పోలీసులకు బాధితుడు వెంకట్రావు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.