ఉద్యోగులకు ఉచిత వసతి మరో రెండు నెలలు పొడిగింపు

ABN , First Publish Date - 2022-05-01T03:01:23+05:30 IST

హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పనిచేస్తున్న

ఉద్యోగులకు ఉచిత వసతి మరో రెండు నెలలు పొడిగింపు

అమరావతి: హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగుల ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ  చేసింది. మే 1 తేదీ నుంచి జూన్ 30 తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ  జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఏపీ సచివాలయం మహిళా ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీఓలు, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్  ఇతర ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరో రెండు నెలల పాటు ఉచిత వసతి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. 


Updated Date - 2022-05-01T03:01:23+05:30 IST