కేంద్రం శుభవార్త: 75 రోజుల పాటు ఉచితంగా Covid Boosters
ABN , First Publish Date - 2022-07-13T22:39:54+05:30 IST
కోవిడ్ బూస్టర్ డోసులపై కేంద్రం శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు..
న్యూఢిల్లీ: కోవిడ్ బూస్టర్ డోసుల (Covid booster doses)పై కేంద్రం శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు ఉచితంగా (Free) బూస్టర్ డోస్లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జూలై 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బూస్టర్ డోస్లు వేయించుకోవచ్చని తెలిపింది. దేశ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటున్న తరుణాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) బుధవారంనాడు తెలిపారు.
ఈనెల 15 నుంచి రాబోయే 75 రోజుల పాటు 18 ఏళ్లు పైబడిన పౌరులందరూ ఉచితంగా బూస్టర్ డోస్ తీసుకోవచ్చని మంత్రి చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు.