ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు
ABN , First Publish Date - 2021-10-18T05:23:51+05:30 IST
గ్రామాల్లో దాతలు ఏర్పాటు చేస్తున్న ఉచితవైద్య శిబిరాలు పేదలకు మేలు చేస్తున్నాయని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు.
పెదపూడి, అక్టోబరు 17: గ్రామాల్లో దాతలు ఏర్పాటు చేస్తున్న ఉచితవైద్య శిబిరాలు పేదలకు మేలు చేస్తున్నాయని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. పెదపూడి మండలం జి.మామిడాడలో కర్రి సూరయ్య (చినబాబు) జయంతి సందర్భంగా మాజీ ఎంపీపీ, మండల కోఆప్షన్ సభ్యుడు కర్రి శ్రీవెంకటరెడ్డి, కర్రి వెంకటరమణ(పెద్దబాబు) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కాకినాడ ఎంపీ వంగా గీత, అనపర్తి, కాకినాడ ఎమ్మె ల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డితో కలసి భరత్రామ్ ప్రారంభించి దాతల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ పీ కేతా తులసి, జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, సర్పంచ్ లంక మున్ని, ఉపసర్పంచ్ మేడపాటి తాతారెడ్డి, గ్రామ కన్వీనర్ ద్వారంపూడి సూర్యనారాయ ణరెడ్డి, న్యాయవాదులు మండ రాజారెడ్డి, కేతా శ్రీనివాస్ పాల్గొన్నారు.