Freedom Run: బాన్సువాడలో ‘ఫ్రీడం రన్’... పాల్గొన్న పోచారం
ABN , First Publish Date - 2022-08-11T15:36:22+05:30 IST
స్వతంత్ర భారత వజ్రోత్సవాలో భాగంగా బాన్సువాడ పట్టణంలో "ఫ్రీడం రన్" నిర్వహించారు.
కామారెడ్డి: స్వతంత్ర భారత వజ్రోత్సవాలో భాగంగా బాన్సువాడ పట్టణంలో "ఫ్రీడం రన్"(Freedom Run) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి (Pocharam Srinivas reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ (Telangana assembly speaker) మాట్లాడుతూ.... స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ వంటి స్వాతంత్ర్య సమరయోధులు అనేక మంది పోరాటం చేసి 200 సంవత్సరాల పరాయి పాలనను విముక్తి చేశారన్నారు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు వారి త్యాగమని అన్నారు. స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని... పేదరికం పోవాలని అందరూ సంతోషంగా జీవించాలని స్పీకర్ (Speaker) పోచారం శ్రీనివాస రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ (Jangam gangadhar), ఆర్డీవో రాజా గౌడ్ (Raja goud), డీఎస్పీ జైపాల్ రెడ్డి (Jaipal reddy), ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.