వీరుల త్యాగంతోనే స్వేచ్ఛ: హోంమంత్రి సుచరిత

ABN , First Publish Date - 2022-02-03T23:08:39+05:30 IST

దేశంలో ఎందరో వీరుల త్యాగంతోనే మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని హోంమంత్రి

వీరుల త్యాగంతోనే స్వేచ్ఛ: హోంమంత్రి సుచరిత

గుంటూరు: దేశంలో ఎందరో వీరుల త్యాగంతోనే మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని హోంమంత్రి సుచరిత అన్నారు. పట్టణంలో జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశ సైనికుల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారన్నారు. టవర్‌‌పై వివాదం సృష్టించడం సిగ్గు చేటన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించాల్సిన దేశ పాలకులు చిచ్చు పెట్టాలని చూడటం బాధాకరమన్నారు. జాతీయ స్థాయిలో పాలన చేస్తున్న బీజేపీ కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అందరం ఐక్యతతో ఉండటం కారణంగానే ప్రశాంతంగా ఉంటున్నామన్నారు. టవర్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి మంచి ముగింపు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-03T23:08:39+05:30 IST