TS news: ట్రాన్స్‌జెండర్‌పై స్నేహితుడి దాడి...చికిత్స పొందుతూ మృతి

ABN , First Publish Date - 2022-07-23T16:45:16+05:30 IST

స్నేహితుడి దాడిలో ట్రాన్స్‌జెండర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

TS news: ట్రాన్స్‌జెండర్‌పై స్నేహితుడి దాడి...చికిత్స పొందుతూ మృతి

సంగారెడ్డి: స్నేహితుడి దాడిలో ట్రాన్స్‌జెండర్(Transgender) ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొండాపూర్ మండలం మరేపల్లీలో ట్రాన్స్ జెండర్ దీపికపై స్నేహితుడు సాయి హర్ష దాడి చేశాడు. తీవ్ర గాయాలతో హైదరాబాద్(Hyderabad) చందానగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దీపిక ప్రాణాలు కోల్పోయింది. దీపిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసిన వైద్యులు... హత్య అని తేల్చారు. గురువారం రోజు బోనాల పండుగ కోసం అంబర్ పేటకు చెందిన ట్రాన్స్ జెండర్ దీపిక సంగారెడ్డి వెళ్లినట్లు తెలుస్తోంది. దీపిక హత్యపై డీఎస్పీ రవీందర్ రెడ్డి నేతృత్వంలో విచారణ జరిగింది. ట్రాన్స్‌జెండర్‌ను ఎల్బీనగర్‌కు చెందిన సాయి హర్ష హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-07-23T16:45:16+05:30 IST