దెబ్బతిన్న పండ్లతోటలను పరిశీలించిన కస్తూరి
ABN , First Publish Date - 2020-11-30T04:59:27+05:30 IST
ఓబులవారిపల్లె మండలంలో నివర్ తుఫానుతో దెబ్బతిన్న పండ్లతోటలను ఆదివారం రైల్వేకోడూరు టీడీపీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు పరిశీలించారు.
ఓబులవారిపల్లె, నవంబరు29 : ఓబులవారిపల్లె మండలంలో నివర్ తుఫానుతో దెబ్బతిన్న పండ్లతోటలను ఆదివారం రైల్వేకోడూరు టీడీపీ ఇన్చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు పరిశీలించారు. వై.కోట పంచాయతీతో పాటు బి.కమ్మపల్లె, బోటుమీదపల్లె, కాకర్లవారిపల్లె గ్రామాల్లో ఆయనపర్యటించి నష్టపోయిన రైతులతో మాట్లాడి పడిపోయిన పండ్లతోటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఓబులవారిపల్లె టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు గంగరాజు వెంకటేశ్వరరాజు, ఉపాధ్యక్షులు చప్పిడి రమే్షబాబునాయుడు, మాజీ సర్పంచ్ దుర్గయ్య, బి.కమ్మపల్లె రైతులు శంకరనాయుడు, నాగేశ్వరనాయుడు, కాకర్లరెడ్డయ్యనాయుడు, చిట్వేలి మండల శాఖ అధ్యక్షుడు కె.కె.చౌదరి, కటికం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.