ఆలయాల అభివృద్ధికి నిధులు: మంత్రి వెల్లంపల్లి

ABN , First Publish Date - 2022-02-05T01:10:54+05:30 IST

రాష్ట్రంలో హిందూ ఆలయాల అభివృద్ధి కోసం నిధులను సీఎం

ఆలయాల అభివృద్ధికి నిధులు: మంత్రి వెల్లంపల్లి

విజయవాడ: రాష్ట్రంలో హిందూ ఆలయాల అభివృద్ధి కోసం నిధులను సీఎం జగన్ కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇంద్రకీలాద్రి పై ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గగుడి అభివృద్ధి పనులపై ఈ రోజు సమీక్ష చేశామన్నారు. పనుల వివరాలపై  దేవాదాయ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారని ఆయన తెలిపారు. సీఎం అడిగిన వెంటనే దుర్గగుడికి నిధులు కేటాయించారని ఆయన పేర్కొన్నారు. అప్పుడప్పుడు కొండ చరియలు పడుతయన్నాయన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఆలయానికి నిధులు ఇవ్వలేదన్నారు.  సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-05T01:10:54+05:30 IST