ఎంపీటీసీలకు నిధులు కేటాయించాలి
ABN , First Publish Date - 2020-07-05T10:19:43+05:30 IST
ప్రజలచేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఎంపీటీసీలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదంటూ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు నిరసన
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వినూత్న నిరసన
కడ్తాల్: ప్రజలచేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఎంపీటీసీలకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదంటూ మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీటీసీల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి 25శాతం నిధులు మండల పరిషత్లకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లు రాములుగౌడ్, ఉమావతి, కో-ఆప్షన్ మెంబర్ జహంగీర్ బాబా, నాయకులు బీక్యానాయక్, యాట నర్సింహ పాల్గొన్నారు.