ఆస్తి రాసిచ్చాక అంత్యక్రియలు: మొదటి భార్యతో రెండో భార్య గొడవ
ABN , First Publish Date - 2022-07-08T01:08:41+05:30 IST
జగిత్యాల జిల్లా: చనిపోయిన భర్తకు అంత్యక్రియలు నిర్వహించకుండా అస్తి కోసం ఇద్దరు భార్యలు గొడవపడ్డారు. భర్త మృతదేహాన్ని ఇంటి వద్దే వదిలేసి రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ
జగిత్యాల జిల్లా: చనిపోయిన భర్తకు అంత్యక్రియలు నిర్వహించకుండా అస్తి కోసం ఇద్దరు భార్యలు గొడవపడ్డారు. భర్త మృతదేహాన్ని ఇంటి వద్దే వదిలేసి రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ ఘటన కోరుట్ల మండలంలో జరిగింది. అయిలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ మామిడాల నర్సింహులు (55) మృతి చెందాడు. ఈయన మొదటి భార్య పేరిట కొంత ఆస్తి ఉంది. అందులో కొంత భాగాన్ని తన పేరు మీద రాసే వరకు అంత్యక్రియలు జరపడానికి వీల్లేదని రెండో భార్య మొండికేసింది. ఆస్తి పంపకాల కోసం ఇద్దరు భార్యలు మృతదేహన్ని కోరుట్ల పట్టణం ప్రకాశం రోడ్డులోని ఇంటి వద్ద వదిలేసి కథలాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లారు.