కొవిడ్ మృతురాలికి అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-05-09T05:14:47+05:30 IST
ఆత్మకూరు పట్టణంలో కొవిడ్తో మృతి చెందిన ఓ మహిళ అంత్యక్రియలను వెలుగోడుకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు నిర్వహించారు.
ఆత్మకూరు,
మే 8: ఆత్మకూరు పట్టణంలో కొవిడ్తో మృతి చెందిన ఓ మహిళ అంత్యక్రియలను
వెలుగోడుకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు నిర్వహించారు.
ఆత్మకూరు పట్టణంలో కొవిడ్ వల్ల ఓ ముస్లిం మహిళ మృతి చెందడంతో ఆమె
అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సమాచారం తెలుసుకున్న
పాపులర్ ఫ్రంట్ ఇండియా ప్రతినిధులు అంత్యక్రియలు నిర్వహించేందుకు
ముందుకొచ్చారు. నలుగురు వ్యక్తులు పీపీకిట్లు ధరించి ఆమెను ఖబరస్తాన్కు
తీసుకెళ్లారు. ముస్లిం సంప్రదాయపద్ధతుల్లోనే అంత్యక్రియలను పూర్తి చేశారు.
వీరిసేవలను స్థానిక ప్రజలు ప్రశంసించారు.