అర్జున్ కుటుంబ మృతదేహాలకు నేడు అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-06-05T18:24:01+05:30 IST
కర్నాటక ప్రమాద ఘటనలో మృతి చెందిన అర్జున్ కుటుంబ మృతదేహాలకు నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు
హైదరాబాద్: కర్నాటక ప్రమాద ఘటనలో మృతి చెందిన అర్జున్ కుటుంబ మృతదేహాలకు నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గాంధీ హస్పిటల్ నుంచి అల్వాల్ బంజారా కాలనీకి నాలుగు మృతదేహాలను తరలించారు. అర్జున్ నివాసానికి బంధువులు, స్నేహితులు వచ్చారు. అర్జున్ కుటుంబసభ్యులు సోకసముద్రంలో మునిగిపోయారు. కర్ణాటక బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అర్జున్ కుమార్, అతని భార్య సరళాదేవి, కుమారుడు వివాన్, మేనత్త అనిత సజీవదహనమయ్యారు. అర్జున్ సోదరుడు అశ్విన్ అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు.
మే నెల 28న సికింద్రాబాద్ రిసాలబజార్ బంజారా నగర్కు చెందిన అర్జున్కుమార్ తనతో పాటు 26 మంది కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి విహారయాత్రకు గోవా వెళ్లారు. విహార యాత్రను ముగించుకొని జూన్ 2న నగరానికి తిరిగి వస్తుండగా కర్ణాటకలోని కాలబురిగీలో అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అర్జున్ కుమార్ (36), సరళ (34), అనిత (58), రవళి (32), శివ (38), వివాన్ (3), దీక్షిత్ (9) ప్రమాదంలో మృతి చెందారు.