గచ్చిబౌలిలో హోటల్‌ ముసుగులో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు..

ABN , First Publish Date - 2021-03-26T13:10:23+05:30 IST

గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో హోటల్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న

గచ్చిబౌలిలో హోటల్‌ ముసుగులో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు..

హైదరాబాద్/గచ్చిబౌలి : గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో హోటల్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును మాదాపూర్‌ ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. పోలీసులు వ్యభిచార గృహంపై దాడిచేసి విటులతోపాటు నిర్వాహకులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రధాన నిందితులు, నిర్వాహకులు ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ. 32,510, ఐదు ఫోన్లు, 53 కండోమ్స్‌ ప్యాకెట్లు, హోటల్‌ రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్‌, అజయ్‌, సంజయ్‌ గచ్చిబౌలి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలోని కొండాపూర్‌ శ్రీరాంనగర్‌లోని ప్లాట్‌నెంబర్‌ 216-బిలో రాయల్‌ డీలక్స్‌ పేరుతో హోటల్‌ నిర్వహిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నడుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మూడు రోజులుగా నిఘా పెట్టి ఐదుగురు విటులు, ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. బిజు, దీపక్‌కుమార్‌, కిషోర్‌దాల్‌, నిథిన్‌జోషి, బండి నారాయణ, తోట వెంకటే్‌షతోపాటు ఆరుగురు యువతులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకులు ప్రభాకర్‌, అజయ్‌, సంజయ్‌ పరారీలో ఉన్నారు.

Updated Date - 2021-03-26T13:10:23+05:30 IST