పోలవరం నిర్వాసితులకు పరిహారంపై షెకావత్ ఆరా
ABN , First Publish Date - 2022-03-04T21:06:06+05:30 IST
పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, ఆర్అండ్ఆర్పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్ హాజరైనారు.
ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్ పురోగతి, ఆర్అండ్ఆర్పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి షెకావత్, సీఎం జగన్ హాజరైనారు. ఈ భేటీలో నిర్వాసితులకు పరిహారంపై షెకావత్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పునరావాస కల్పన కేవలం 20.19 శాతమే పూర్తికావడంపై చర్చించారు. గతంలో ఆమోదించిన ప్రాజెక్ట్ అంచనా వ్యయం.. రూ.55,656.87 కోట్లకు క్లియరెన్స్ జగన్ ఇవ్వాలని కోరారు. 194 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవసరమయ్యే.. భూసేకరణ, పునరావాస కార్యక్రమాలపై కేంద్రమంత్రి ఆరా తీశారు.
సీఎం, కేంద్ర మంత్రి ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరిపేట పునరావాస కాలనీకి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. అక్కడినుంచి 11.20కి పశ్చిమగోదావరిలోని తాడువాయి పంచాయతీ చల్లావారిగూడెం కాలనీకి చేరుకుని నిర్వాసితులతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్షించారు.