నెల్లూరు కథకు జాతీయ పురస్కారం

ABN , First Publish Date - 2020-08-07T11:20:37+05:30 IST

ల్లూరుకు చెందిన రచయిత, జర్నలిస్టు, న్యాయవాది లెనిన్‌ ధనిశెట్టి రచించిన కథ ‘గాజుబొమ్మ’ కథకు ..

నెల్లూరు కథకు జాతీయ పురస్కారం

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) ఆగస్టు 6 : నెల్లూరుకు చెందిన రచయిత, జర్నలిస్టు, న్యాయవాది లెనిన్‌ ధనిశెట్టి రచించిన కథ ‘గాజుబొమ్మ’ కథకు జాతీయ పురస్కారం లభించింది. దక్కన్‌ ఆర్కియలాజికల్‌ అండ్‌ కల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో పుడమి సాహితీ వేదిక 2020 సంవత్సరానికిగాను ఉత్తమ కథగా ‘గాజు బొమ్మ’ను ఎంపిక చేశారు.


తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాలలో గురువారం జరిగిన సమావేశంలో లెనిన్‌కు ఈ పురస్కారాన్ని దక్కన్‌ ఆర్కియలాజికల్‌, కల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌ కుర్రా జితేంద్రబాబు ప్రదానం చేశారు. గాజుబొమ్మ కథను లెనిన్‌ 1994లో రచించారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయి యువతను కూడా ఆకట్టుకుంది. ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా ప్రథమ స్థానంలో నిలిచిన ఈ కథకు ఇన్నేళ్ల తర్వాత జాతీయ పురస్కారం దక్కడంపై రచయితలు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-07T11:20:37+05:30 IST