Gajwel నుంచి తిరుపతికి రైలు: హరీశ్రావు
ABN , First Publish Date - 2022-05-14T00:51:45+05:30 IST
త్వరలోనే గజ్వేల్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపనున్నామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
గజ్వేల్: త్వరలోనే గజ్వేల్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపనున్నామని మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గానికి 2014 తర్వాత మహర్దశ పట్టుకుందన్నారు. గజ్వేల్ నుంచి తిరుపతికి త్వరలోనే రైళ్లు నడుస్తాయని ఎవరూ ఊహించలేదని, అది త్వరలో జరుగబోతుందని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ దశ, దిశ మారిందని, అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్వన్గా నిలిచిందన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని అందులో భాగంగానే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 99లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే తెలంగాణ వచ్చాక 2లక్షల కోట్ల 59 మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సొంత జాగ ఉంటే ఇళ్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు త్వరలోనే అందించనున్నట్లు హరీశ్రావు ప్రకటించారు.