ఘనంగా తెలుగు మహిళా కమిటీ ప్రమాణం

ABN , First Publish Date - 2022-08-08T02:37:39+05:30 IST

కందుకూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుమహిళా కమిటీ ప్రమాణస్వీకారోత్సవం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం

ఘనంగా తెలుగు మహిళా కమిటీ ప్రమాణం
ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న తెలుగు మహిళా కమిటీల ప్రతినిధులు

కందుకూరు, ఆగస్టు 7: కందుకూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుమహిళా కమిటీ ప్రమాణస్వీకారోత్సవం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. నియోజకవర్గ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు దివి సౌభాగ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ, నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రమాణస్వీకారం చేయించారు. నియోజకవర్గ కమిటీతోపాటు ఐదు మండలాల కమిటీలతో ప్రమాణస్వీకారం చేయించారు. నియోజకవర్గ కమిటీ అధ్యక్షురాలుగా దివి సౌభాగ్య, ప్రధాన కార్యదర్శిగా అల్లం సుమతి, కందుకూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా ముచ్చు లక్ష్మీరాజ్యం, కల్లూరి శైలజ, కందుకూరు మండలానికి మన్నం శైలజ, బొందు స్రవంతి, వలేటివారిపాలెంకు గురజాల ఆంతోనమ్మ, స్వర్ణ రజని, లింగసముద్రంకు బొజ్జా విజయమ్మ, చాగంటి చెంచులక్ష్మి, ఉలవపాడు మండలానికి సన్నెబోయిన ప్రభావతి, కత్తి లక్ష్మీకుమారి,  గుడ్లూరుకు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా జొన్నలగడ్డ రమణమ్మ, గుండ్లాపల్లి రత్తమ్మలతో పాటు మిగిలిన కమిటీ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. 


Updated Date - 2022-08-08T02:37:39+05:30 IST