పింఛన్ల తొలగింపుపై గాంధీ సాక్షిగా నిరసన
ABN , First Publish Date - 2022-08-08T08:09:58+05:30 IST
పింఛన్ల తొలగింపుపై గాంధీ సాక్షిగా నిరసన
కడప, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారనే నెపంతో వారి కుటుంబీకుల పింఛన్లు తొలగించడం అన్యాయమంటూ సామాజిక కార్యకర్త నాగవేణి, భర్త చనిపోయినా భర్త ఉన్నాడంటూ పింఛన్ పోగొట్టుకున్న భాగ్యలక్ష్మిలు కడప నగరంలోని రెండో గాంధీ బొమ్మ ఎదుట ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ చిరు ఉద్యోగుల కుటుంబ సభ్యుల పింఛన్ తొలగించడం బాధాకరం, చిన్న జీతానికి కూడా పెద్ద శిక్ష, సంక్షేమ పథకాలకు అనర్హులమనే బ్యానర్ చేతపట్టుకొని నిరసన చేపట్టారు. బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కోసం గాంధీజీ నిరసన చేపట్టారని ఆయన స్ఫూర్తితోనే నిరసనకు దిగామని వారు తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనాలు సరిపోవడం లేదు. ఆ కుటుంబాల్లో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లు తీసేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు.