Gang Rape ఘటనపై సీఎం మౌనం సరైంది కాదు: కోదండరామ్‌

ABN , First Publish Date - 2022-06-15T21:08:42+05:30 IST

గ్యాంగ్‌ రేప్ ఘటనపై సీఎం మౌనం సరైంది కాదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

Gang Rape ఘటనపై సీఎం మౌనం సరైంది కాదు: కోదండరామ్‌

హైదరాబాద్: గ్యాంగ్‌ రేప్ ఘటనపై సీఎం మౌనం సరైంది కాదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళల సమస్యలపై 8 ఏళ్లలో ఒక్క సమీక్ష కూడా జరపలేదని తప్పుబట్టారు. మాజీ సీఎం రోశయ్య హయాంలో జరిగిందే చివరి సమీక్ష అని గుర్తుచేశారు. మహిళల సమస్యలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోదండరామ్‌ డిమాండ్ చేశారు. 


విదేశీయుడైన ఓ వ్యక్తి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు కుమారుడు, కుమార్తె(16) ఉన్నారు. అతడి కుమార్తె ఓపెన్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే గత నెల 28న ఇంటి పక్కన ఉన్న హాదీ అనే ఈవెంట్ ఆర్గనైజర్ పిలుపు మేరకు ఆ బాలిక.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైంది. అదే పార్టీలో పాల్గొన్న ఐదుగురు కుర్రాళ్లు.. ఆమెకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లారు. అనంతరం ఆమెను కారులో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. కూతురు ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం ఆరా తీయగా జరిగిన ఘోరం బయటపడింది. దీంతో ఆ బాలిక తండ్రి.. ఐదుగురు కుర్రాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో వక్ఫ్‌బోర్డు చైర్మన్ కుమారుడితోపాటు మరికొందరు రాజకీయ ప్రముఖుల పిల్లలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  రాజకీయ ప్రముఖల పిల్లలు ఉండటంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-06-15T21:08:42+05:30 IST