రెండు నెలలుగా బాలికపై గ్యాంగ్ రేప్.. వీడియోలు తీసి..

ABN , First Publish Date - 2022-06-07T16:02:13+05:30 IST

హైదరాబాద్‌లో రోజుకో దారుణం వెలుగు చూస్తోంది. కార్ఖానాలో బాలికపై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.

రెండు నెలలుగా బాలికపై గ్యాంగ్ రేప్.. వీడియోలు తీసి..

హైదరాబాద్ : హైదరాబాద్‌(Hyderabad)లో రోజుకో దారుణం వెలుగు చూస్తోంది. కార్ఖానాలో బాలికపై ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ధీరజ్, రితేష్ అనే యువకులతో బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రోజూ మాట్లాడుతూ బాలికతో చనువు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఒక రోజు హోటల్ గదికి రప్పించి బాలికపై వీరిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో వీడియోలు(Videos) తీసి.. బెదిరిస్తూ రెండు నెలలుగా ఆమెపై అత్యాచారం జరుపుతూ నరకం చూపిస్తున్నారు.


ఇక ఇటీవల ఆ వీడియోలు ఇచ్చేస్తాం రమ్మని నమ్మబలికి మరోసారి లాడ్జ్‌కి పిలిచి తన మిత్రులతో సైతం బాలికపై ధీరజ్ రేప్ చేయించాడు. రెండు నెలలుగా బాధితురాలు ఈ విషయాల గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ మానసికంగా కృంగిపోతుండటంతో తల్లిదండ్రులు ఆమెను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళారు. తనపై రెండు నెలలుగా జరుగుతున్న అత్యాచారానికి సంబంధించిన అన్ని విషయాలను ఆమె సైక్రియాటిస్ట్ వద్ద వెల్లడించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మే 30న కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మైనర్‌తోపాటు ఇద్దరిని అరెస్ట్ చేశారు.


Updated Date - 2022-06-07T16:02:13+05:30 IST