ఒడిషా మహిళపై గ్యాంగ్ రేప్
ABN , First Publish Date - 2022-04-17T00:47:59+05:30 IST
ఒడిషా రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల మహిళపై శుక్రవారం రాత్రి గ్యాంగ్రేప్ జరిగింది. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో
పిడుగురాళ్ల: ఒడిషా రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల మహిళపై శుక్రవారం రాత్రి గ్యాంగ్రేప్ జరిగింది. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో జరిగిన ఘటన శనివారం ఉదయం వెలుగు చూసింది. గ్యాంగ్రేప్కు గురైన ఒరిస్సా మహిళపై నలుగురైదుగురు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రక్తస్రావం కావటంతో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె అసలు రైల్వేస్టేషన్ వద్దకు ఎప్పుడు వచ్చింది.. ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను రైల్వే అధికారులు విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శుక్రవారం రాత్రి 9-10 గంటల మధ్యలో బాధిత మహిళ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చినట్లు సమాచారం.
రైలు ఎక్కేందుకు వచ్చిందా, లేక తలదాచుకునేందుకు వచ్చిందా అనే వివరాలను రైల్వే అధికారులు కేసు నమోదు చేసుకొని ఆరా తీస్తున్నారు. సమీపంలోని మెయిన్రోడ్డులో ఉన్న కొన్ని సీసీ పుటేజ్లను అధికారులు పరిశీలించే పనిలో ఉన్నారు. గ్యాంగ్ రేప్కు గురైన ఒరిస్సా మహిళ ఏమీ మాట్లాడక పోవటం వల్ల పూర్తి వివరాలు అధికారులకు తెలియలేదు. బాధిత మహిళను గురజాల మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. ఘటనకు బాధ్యులైన వారిని అధికారులు కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.