తిరుపతిలో గంగ జాతర
ABN , First Publish Date - 2021-05-15T06:07:21+05:30 IST
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో శుక్రవారం గంగజాతర సందడి కనిపించింది.
తిరుపతి(కల్చరల్), మే 14: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో శుక్రవారం గంగజాతర సందడి కనిపించింది. కొవిడ్ నేపథ్యంలో జాతరను అట్టహాసంగా జరపకున్నా.. భక్తులు మాత్రం గంగమ్మ గుడికి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి వేకువజామున ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనం కల్పించేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేశారు. నగరంలోని పలు వీధుల కూడళ్లలో నడివీధి గంగమ్మను ఏర్పాటుచేసి పూజలు నిర్వహించారు. చిన్నపిల్లలు, మహిళలు వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.